సినిమాలు చూసి, వాటిలో హీరోల డైలాగులు, మేనరిజాలు, డ్యాన్సులు కాపీ కొడుతుంటారు కుర్రాళ్లు. కానీ కొందరు మాత్రం వాటిలోని హింసను కాపీ కొట్టి సమాజానికి హాని చేస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చిన ‘కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2’ ఎంతటి హిట్టయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు.
ఆ సినిమాలో హీరో ఒక పెద్ద డాన్ను చంపేందుకు వెళ్తాడు. ఈ క్రమంలో జరిగే హింసను చూసి ఇన్స్పైర్ అయిన ఒక 19 ఏళ్ల కుర్రాడు.. విచక్షణారహితంగా నాలుగు హత్యలు చేశాడు. శివ ప్రసాద్ (19) అనే కుర్రాడు భోపాల్కు 169 కిలోమీటర్ల దూరంలోని సాగర్లో మొదలైంది. ఆగస్టు 28న కల్యాణ్ లోధి అనే సెక్యూరిటీ గార్డు నిద్రపోతుండగా.. తలపై మార్బుల్ రాడ్డుతో కొట్టి చంపేశాడు శివప్రసాద్.
ఆ తర్వాతి రాత్రే స్థానికంగా ఉన్న కాలేజీలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే శంభు నారాయణ్ దూబే (60)ను కూడా రాయితో తల పగలగొట్టి చంపేశాడు. ఇలా ఈ ప్రాంతంలో ముగ్గుర్ని చంపేసి భోపాల్ చేరుకున్నాడు. అక్కడ కూడా ఒక సెక్యూరిటీ గార్డును రాత్రి పూట నిద్రిస్తుండగా హతమార్చాడు. వీళ్ల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా దోచుకోలేదు. దాంతో రాత్రి పూట తలలు పగలగొట్టే సైకో కిల్లర్ తిరుగుతున్నాడని ప్రజలంతా వణికిపోయారు.
महज़ 19-20 साल की उम्र में नाम हासिल करने के लिये आरोपी ने 5 सिक्योरिटी गार्ड को पत्थर से कुचलकर मार डाला ऐसा पुलिस का कहना है. सीसीटीवी फुटेज में वो बेरहमी से कत्ल करता दिख रहा है @ndtv @ndtvindia https://t.co/vupRSULQIj pic.twitter.com/pTKcV4jSDk
— Anurag Dwary (@Anurag_Dwary) September 2, 2022
ఒక సీసీ ఫుటేజీలో హత్య చేసి పరారవుతున్న శివ ప్రసాద్ కనిపించాడు. దీంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతన్ని ట్రేస్ చేయడం ప్రారంభించారు. తను రెండోసారి చంపేసిన వ్యక్తి మొబైల్ కాజేసీన శివ ప్రసాద్.. దాన్ని తన వద్దే ఉంచుకున్నాడు. దాని ద్వారా శివ ప్రసాద్ను ట్రేస్ చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా.. తను బాగా ఫేమస్ అవ్వడానికి ఇదంతా చేశానని, త్వరలో పోలీసు అధికారులను చంపాలని టార్గెట్ చేయాలని అనుకున్నానని శివ ప్రసాద్ చెప్పాడు.