పాట్నా: రైల్వే పరీక్షల నిర్వహణలో అవకతవకలను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు శుక్రవారం బీహార్ బంద్ చేపట్టాయి. చాలా చోట్ల విద్యార్థులు రోడ్ల మీద టైర్లను తగులబెట్టారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల విద్యార్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రైల్వే పరీక్షలను సమర్థంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ బంద్కు ప్రతిపక్ష పార్టీలతో పాటు బీజేపీ మిత్రపక్షాలు హిందుస్థానీ ఆవామ్ మోర్చా, వికాశీల్ ఇన్సాన్ పార్టీ మద్దతు తెలిపాయి.