న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. జూన్ 13లోగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే నిరసన ప్రదర్శనలకు సార థ్యం వహించేందుకు తానే స్వయ ంగా వివిధ రాష్ర్టాలను సందర్శిస్తానని ఆదివారం రాత్రి సోషల్ మీడి యా వేదిక ఎక్స్లో పోస్టు చేసిన ఒక వీడియోలో ఆయన పేర్కొన్నారు. అప్పటికీ విద్యా మంత్రి రాజీనామా చేయడానికి నిరాకరించిన పక్షంలో శాంతియుత నిరసన నిర్వహించేందుకు దేశ నలుమూలలకు చెందిన విద్యార్థులు మళ్లీ ఢిల్లీకి కదలివస్తారని ఆయన తెలిపారు. ఆదివారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లోని తన ఇంటికి చేరుకున్న దీప్కే అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 10-12 సంవత్సరాలు భారతీయ రాజకీయాలు హిందూ-ముస్లిం అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాయని, అయితే అటువంటి రాజకీయాలు ఉద్యోగ అవకాశాలను కల్పించలేదని దీప్కే వ్యాఖ్యానించారు.