షిల్లాంగ్, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ, అస్సాంలో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. భద్రతా బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని, ఇన్నర్ లైన్ పర్మిట్ను ఈశాన్య భారతమంతా అమలుచేయాలని డిమాండ్ చేశాయి.
1951 జనాభా లెక్కలను అనుసరించి ఎన్ఆర్సీని అప్డేట్ చేయాలని కోరాయి. అస్సాం ఒడంబడికను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈశాన్య ప్రాంత సంస్కృతి, వైవిధ్యతకు అనుగణంగా ఎడ్యుకేషన్ పాలసీ తీసుకురావాలని కోరాయి.