న్యూఢిల్లీ: అదానీ సంస్థల్లో అక్రమ ధన ప్రవాహం వెనుక కీలక పాత్ర వినోద్ అదానీదేనని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. రష్యా బ్యాంకు నుంచి రుణాన్ని పొందడంలో వినోద్ అదానీ అక్రమాలపై ఫోర్బ్స్ మ్యాగజైన్లో వచ్చిన కథనంపై జైరాం రమేశ్ స్పందించారు.
ఈ అక్రమాలు విచారణార్హం కాదా అని సెబీ, ఈడీని ఆయన ప్రశ్నించారు. ‘ప్రతిపక్ష పార్టీలు, మీడియా, లొంగని వ్యాపారవేత్తలపై విచారణ సంస్థలను ప్రయోగించే మీరు రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన మీ సన్నిహితులను విచారించరా?’ అని ప్రధాని నరేంద్రమోదీని ప్రశ్నించారు.