చింతన్ శిబిర్ చప్పగా సాగిందన్న విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ మరో కీలక అడుగు వేసింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, టాస్క్ఫోర్స్ 2024 ను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రకటించింది. అత్యంత కీలకమైన ఈ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి స్థానం దక్కింది. రాహుల్ గాంధీకి అత్యంత కీలకమైన ఈ కమిటీలో స్థానం దక్కలేదు. అయితే రాహుల్కు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం దక్కింది.
చింతన్ శిబిర్లో ప్రియాంక గాంధీని అధ్యక్షురాలు చేయాలని ఒక్కసారిగా డిమాండ్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నినాదాలు, అభిప్రాయాలను నేతలు వ్యక్తం చేస్తున్న సమయంలో సోనియా, రాహుల్, ప్రియాంక ముగ్గురూ అక్కడే, ఒకే వేదికపై వున్నారు. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ కమిటీలో ప్రియాంకకు స్థానం దక్కడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
1. ప్రియాంక గాంధీ
2. చిదంబరం
3. ముకుల్ వాస్నిక్
4. జయరాం రమేశ్
5. కేసీ వేణుగోపాల్
6. అజయ్ మాకెన్
7. రణదీప్ సూర్జేవాలా
8. సునీల్ కనుగోలు
1. రాహుల్ గాంధీ
2. మల్లికార్జున ఖర్గే
3. గులాంనబీ ఆజాద్
4. అంబికా సోనీ
5. దిగ్విజయ్ సింగ్
6. ఆనంద్ శర్మ
7. కేసీ వేణుగోపాల్
8. జితేంద్ర సింగ్
పార్టీకి పునర్వైభవం కోసం కశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకూ దేశ వ్యాప్తంగా రాహుల్ పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా వున్న నిరుద్యోగ సమస్యను హైలెట్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చింతన్ శిబిర్లో ప్రతిపాదనలు వచ్చాయి. దీనికి సంబంధించిన కమిటీని కూడా సోనియా ప్రకటించారు.
1. దిగ్విజయ్ సింగ్
2. సచిన్ పైలట్
3. శశి థరూర్
4. కేజే జార్జ్
5. రంవీత్ సింగ్ బిట్టూ
6. ప్రద్యుత్ బోల్దోలోయీ
7. జీతూ పట్దారి
8. సలీమ్ అహ్మద్