న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసిన అనంతరం ఈ వ్యవహారంపై ఆయన సోదరి, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా వరుస ట్వీట్లలో ప్రియాంక విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తానేం చేయదలుచుకుంటే అది చేయవచ్చని కానీ తమ కుటుంబం ఆయన ముందు తలవంచబోదని స్పష్టం చేశారు.
మా నరాల్లో ప్రవహించే రక్తం ఎలాంటిదంటే.. మీలాంటి పిరికి, అధికార దాహం కలిగిన నియంత ముందు తాము తలవంచమని మోదీని ఉద్దేశించి ఆమె పేర్కొన్నారు. దేశ ప్రజల కంటే గౌతం అదానీనే అధికమని ప్రధాని మోదీ భావిస్తున్నారానా అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అదానీ లూటీ గురించి, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ గురించి నిజమైన దేశభక్తుడు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే ప్రధాని ఉలిక్కిపడుతున్నారని అన్నారు.
దేశ పార్లమెంట్, దేశంలోని గొప్ప వ్యక్తుల కంటే మీ స్నేహితుడు గౌతం అదానీ పెద్ద వ్యక్తని మీరు భావిస్తున్నారా అని మోదీని నిలదీశారు. రాహుల్ గాంధీ గొంతు నొక్కేందుకు ప్రభుత్వ యంత్రాగమంతా సామధాన బేధ దండోపాయాలను ప్రయోగిస్తోందని అన్నారు. తన సోదరుడు ఎన్నటికీ ఎవరికీ బెదిరిపోడని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. రాహుల్ వాస్తవాలే చెబుతారని, ఇక ముందూ వాస్తవాలే మాట్లాడతారని ప్రియాంక ట్వీట్ చేశారు.
Read More :