వయనాడ్: కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో.. సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ(Priyanka Gandhi).. అత్యధిక మెజారిటీతో విజయాన్ని నమోదు చేయనున్నారు. ఈ ఏడాది ఆ స్థానం నుంచి ఆమె సోదరుడు రాహుల్ గాంధీ సుమారు 3.65 లక్షల ఓట్ల తేడాతో నెగ్గారు. అయితే రాహుల్ గాంధీ రాజీనామాతో ఆ స్థానం నుంచి ప్రియాంకా గాంధీ పోటీ చేశారు. ఉప ఎన్నికలో ప్రియాంకా గాంధీ .. రాహుల్ మెజారిటీని దాటేశారు. తాజా సమాచారం ప్రకారం .. ప్రియాంకా గాంధీ 3,77,517 ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రియాంకాకు 5.78 లక్షల ఓట్లు పోలయ్యాయి. రెండవ స్థానంలో కమ్యూనిస్టు అభ్యర్థి సత్యన్ మోకరి నిలిచారు. ఇక బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ పది వేల ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. 2019లో రాహుల్కు సుమారు 4 లక్షల మెజారిటీ వచ్చింది.