న్యూఢిల్లీ : పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి 12 మంది విపక్ష ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం పట్ల శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎగువ సభ నిర్ణయాన్ని తప్పుపట్టారు. విపక్ష ఎంపీల సస్పెన్షన్ అప్రజాస్వామికమని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతునొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదని, తన సస్పెన్షన్పై రాజ్యసభ చైర్మన్తో మాట్లాడతానని ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు.
కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ 12 మంది విపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసేవరకూ రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ వేటుకు గురైన ఎంపీల్లో ఛాయా వర్మ, రిపున్ బోరా, వినయ్ విశ్వం, రాజమణి పటేల్, డోలా సేన్, ఎలమారం కరీం, పులో దేవి నేతం, సయ్యద్ నజీర్ హుస్సేన్, ప్రియాంక చతుర్వేది, అనిల్ దేశాయ్, అఖిలేష్ ప్రసాద్ సింగ్, శాంత చెట్రి ఉన్నారు.