Private Cars | న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ ప్రైవేట్ కార్లు ఉన్న నగరం ఘనత ఢిల్లీ చేజారింది. 23.1 లక్షల ప్రైవేట్ కార్లతో బెంగళూరు నగరం ఈ ఘనత దక్కించుకుంది. 2023 మార్చి 31 నాటికి ఢిల్లీలో 20.7 లక్షల ప్రైవేట్ కార్లు మాత్రమే ఉన్నాయి. ఢిల్లీ స్టాటిస్టికల్ హ్యాండ్బుక్ 2023లో ఈ వివరాలను వెల్లడించారు. 2021-22, 2022-23లలో 55 లక్షల కార్లు డీరిజిస్టర్ అయ్యాయని, 1.4 లక్షల కార్లు స్క్రాప్గా నిష్క్రమించాయని ఈ పుస్తకంలో తెలిపారు. పదేళ్లు దాటిన డీజిల్ కార్లను, 15 ఏండ్లు దాటిన పెట్రోలు కార్లను సుప్రీంకోర్టు నిషేధించిందని తెలిపారు.