రాయ్పూర్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుర్గుజా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు వెంట ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తాపడటంతో 16 మంది ప్రయాణికుల గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఉదయ్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్గా గ్రామశివారులో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులున్నారు.
వీరంతా రాయ్పూర్ నుంచి జార్ఖండ్లోని గర్హ్వాకు వెత్తున్నట్లు అదనపు ఎస్పీ సునీల్ శర్మ తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉదయ్పూర్ కమ్యూనిటీ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మూలమలుపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదకర జరిగిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.