ముంబై: ఒక ప్రైవేట్ విమానం రన్వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. (Private jet skids off runway) ఆ విమానంలోని ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. బెంగళూరులోని రియల్ ఎస్టేట్ సంస్థ వీఆర్ఎస్ వెంచర్స్కు చెందిన లీర్జెట్ 45 ఎయిర్క్రాఫ్ట్ వీటీ-డీబీఎల్, గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి టేకాఫ్ అయ్యింది. ముంబై ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సందర్భంగా రన్వే నుంచి జారి పక్కకు దూసుకెళ్లింది. గమనించిన ఫైర్, రెస్క్యూ బృందాలు వెంటనే ఆ రన్వే వద్దకు చేరుకున్నాయి. గాయపడిన ముగ్గురిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, ప్రమాద సమయంలో ఆ ప్రైవేట్ విమానంలో ఇద్దరు సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు ఉన్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ముంబై విమానాశ్రయంలోని రన్వే 27లో ల్యాండింగ్ సందర్భంగా విమానం చక్రాలు రన్వేపై స్కిడ్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. భారీగా వర్షం కురుస్తుండటం వల్ల రన్వే సరిగా కనిపించకపోవడంతో ఈ సంఘటన జరిగినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
#WATCH | VSR Ventures Learjet 45 aircraft VT-DBL operating flight from Visakhapatnam to Mumbai was involved in runway excursion (veer off) while landing on runway 27 at Mumbai airport. There were 6 passengers and 2 crew members on board. Visibility was 700m with heavy rain. No… pic.twitter.com/KxwNZrcmO5
— ANI (@ANI) September 14, 2023