న్యూఢిల్లీ: ఇటీవల కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన సంస్థల్లో పెద్దయెత్తున నగదు పట్టుబడటంపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్యంగా విమర్శలు గుప్పించారు. దేశంలో కాంగ్రెస్ లాంటి పార్టీ ఉండగా ‘మనీ హైస్ట్ (నగదు దోపిడీ)’ లాంటి వెబ్సిరీస్లతో పనేముందని వ్యాఖ్యానించారు. ‘భారత్లో 70 ఏండ్ల పురాతన కాంగ్రెస్ పార్టీ దోపిడీ కొనసాగుతుండగా మనీ హైస్ట్ లాంటి కల్పిత గాథలు ఎవరికి అవసరం’ అని ప్రధాని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ పెట్టిన వీడియోను ఆయన జత చేశారు. ఇటీవల సాహు వ్యాపార సంస్థల ఆవరణలో ఐటీ అధికారులు దేశంలోనే అతి భారీ మొత్తంలో రూ.351 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.