Priyank Kharge | బెంగుళూరు, మే 1: ప్రధాని మోదీ టార్గెట్గా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘బంజారాలు బాధపడొద్దు. ఢిల్లీ పీఠంపై మీ కొడుకు ఉన్నాడు’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రియాంక్ మాట్లాడుతూ..
మోదీ బంజారా కొడుకు కాదని, పనికిమాలిన కొడుకు (నలాయక్ బేటా) అని అన్నారు. అలాంటి పనికిరాని కొడుకు ఏం చేస్తారని, మన ఇల్లు ఎలా గడుస్తుందని ప్రశ్నించారు.