న్యూఢిల్లీ: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఇవాళ మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు ఆయన ఫోన్లో సంభాషించారు. ఉక్రెయిన్లో ప్రస్థుతం ఉన్న పరిస్థితిపై ఇద్దరూ చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియను ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. భారతీయుల తరలింపు ప్రక్రియలో ఉక్రెయిన్ సహకరించిన తీరును ప్రశంసిస్తూ.. అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోదీ థ్యాంక్స్ చెప్పారు. సుమీలో చిక్కుకున్న భారతీయ విద్యార్ధుల తరలంపులోనూ ఉక్రెయిన్ సహకరించాలని ఈ నేపథ్యంలో జెలెన్స్కీని ఆయన కోరారు.