న్యూఢిల్లీ, జూలై 25: విపక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ సంచలన కామెంట్లు చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా విపక్షాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయన్నారు. ఈస్టిండియా కంపెనీ, ఇండియన్ ముజాహిదీన్, నిషేధిత సంస్థ ‘పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ (పీఎఫ్ఐ)లతో పోల్చుతూ..విపక్షాల ‘ఇండియా కూటమి’ కూడా అలాంటిదేనని ఎద్దేవా చేశారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేశారు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే విపక్షాలు తమ కూటమికి ‘ఇండియా’ అనే పేరును జోడించారని ప్రధాని అన్నారు.