న్యూఢిల్లీ: భారత దేశ సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాల గురిం చి ప్రపంచానికి చాటి చెప్పాలని ప్ర ధాని మోదీ పిలుపునిచ్చారు. మన దేశం గురించి సృజనాత్మకంగా ప్ర పంచానికి తెలియజెప్పే ఉద్యమాన్ని ప్రారంభించాలని కోరారు.
నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ను న్యూఢిల్లీలో ప్రదానం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ పురస్కారాలను అందుకున్నవారిలో పంక్తి పాండే, కీర్తిక గోవింద స్వామి, గాయని మై థిలి ఠాకూర్, గౌరవ్ చౌదరి (టెక్ క్యాటగిరీలో బెస్ట్ క్రియేటర్), కామి యా జాని ఉన్నారు.