హైదరాబాద్: చత్తీస్ఘడ్లోని బస్తర్ జిల్లాలో జరిగిన జర్నలిస్టు ముకేశ్ మర్డర్ కేసు(Journalist Murder Case)తో లింకున్న వ్యక్తిని హైదరాబాద్లో ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. ఆ హత్య కేసులో అతన్ని ముఖ్య అనుమానితుడిగా భావిస్తున్నారు. బీజాపూర్ పోలీసు శాఖకు చెందిన సిట్ బృందం అతన్ని అరెస్టు చేసింది. సురేశ్ చంద్రాకర్ సోదరులైన రితేశ్ చంద్రాకర్, దినేశ్ చంద్రాకర్, మహేంద్రను అరెస్టు చేసినట్లు బస్తర్ పోలీసులు తెలిపారు. రితేశ్ను రాయ్పూర్లో.. దినేశ్, మహేంద్రలను బీజాపూర్లో అరెస్టు చేశారు. హైదరాబాద్లో మరింత లోతుగా గాలింపు చేస్తున్నామన్నారు.
#WATCH | Prime accused of journalist Mukesh Chandrakar’s murder case, Suresh Chandrakar, who was absconding after the crime, has been detained. The accused was detained from Hyderabad late last night by the SIT and he is being questioned
In Bijapur, SIT in-charge, Mayank Gurjar… pic.twitter.com/f4hCz9Wb7D
— ANI (@ANI) January 6, 2025
జర్నలిస్టు ముకేశ్ చంద్రాకర్ మర్డర్ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు సురేశ్ను అరెస్టు చేసినట్లు బీజాపూర్ సిట్ ఇంచార్జీ మయాంక్ గురుజార్ తెలిపారు. హైదరాబాద్లో ఆదివారం రాత్రి అరెస్టు చేసినట్లు చెప్పారు.