లక్నో: డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొలువై ఉన్న ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థులతో టాయిలెట్ను కడిగించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలియా జిల్లాలోని పిప్రాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉన్నది. స్కూల్ ప్రిన్సిపాల్ మైనర్లయిన విద్యార్థులతో టాయిలెట్ శుభ్రం చేయించాడు.
అంతటితో ఊరుకోకుండా టాయిలెట్ పరిశుభ్రంగా లేకపోవడంతో ఇంటికి పంపిస్థానని బెదిరించాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో అది వైరల్గా మారింది. అదికాస్తా అధికారుల దృష్టికి రావడంతో విచారణకు ఆదేశించారు. పాఠశాల ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
बलिया
🟥बच्चों का स्कूल में टॉयलेट साफ करते वीडियो वायरल
🟥स्कूल का हेडमास्टर बच्चों से साफ करा रहा टॉयलेट
🟥सोहांव ब्लॉक के पिपरा कला प्राथमिक विद्यालय का मामला#UP | #ballia | #IndiaNewsUP @balliapolice pic.twitter.com/OrlhTNZOez
— India News UP/UK (@IndiaNewsUP_UK) September 7, 2022