Manipur | ఇంఫాల్: హింస, ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా రాజధాని ఇంఫాల్, చుట్టుపక్కల ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ను బ్లాక్మార్కెట్లో రూ.200కు అమ్ముతున్నారు. అత్యావశ్యక ఔషధాల కొరత తీవ్రస్థాయికి చేరుకుంది. వంటనూనె లీటర్ ధర రూ.250 నుంచి 280 వరకు పలుకుతున్నది.
బియ్యం, టమాటా, ఆలుగడ్డ మొదలైనవాటి ధరల్ని రూ.30 నుంచి రూ.40 వరకు పెంచటంతో సామాన్యులు కొనలేన పరిస్థితి నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లలో నగదులేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లను దిగ్బంధనం చేయటాన్ని విరమించుకోవాలని ఆందోళనకారుల్ని అమిత్ షా కోరారు.