న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ (19 కిలోలు) ధర రూ.39.50 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,757కు చేరింది. ముంబైలో రూ.1,710, కోల్కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ. 1,929కి సిలిండర్ దొరుతున్నది.
అంతర్జాతీయంగా గ్యాస్ ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలోనే తాజాగా ధరలు తగ్గినట్టు గ్యాస్ కంపెనీలు తెలిపాయి. ఇండ్లలో వినియోగించే 14.2 కిలోల సిలిండర్ ధరలో మార్పు
లేదని వెల్లడించాయి.