న్యూఢిల్లీ : ఏప్రిల్ 1 నుంచి పారాసిటమాల్ సహా రోజువారీ ఉపయోగించే 800 ఔషధాల ధరలు 10.7 శాతం పెరగనున్నాయి. 2021 క్యాలెండర్ సంవత్సరం హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ)లో 10.7 శాతం సవరించినట్టు జాతీయ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్పీపీఏ) ప్రకటించింది.
దీంతో జాతీయ జాబితాలో ఉన్న అత్యవసర మందుల ధరలు ఎగబాకనున్నాయి. జ్వరం, ఇన్ఫెక్షన్స్, గుండె జబ్బులు, హైబీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా చికిత్సకు ఉపయోగించే మందులు పెరగనున్నాయి. పారాసిటమాల్, ఫెనోబర్బిటోన్, అజిత్రోమైసిన్, సిఫ్రాన్, హైడ్రోక్లోరెడ్, మెట్రిండజోల్ వంటి మందుల ధరలు భారం కానున్నాయి. ప్రొవిజన్స్ ఆఫ్ డ్రగ్స్ (ధరల నియంత్రణ) ఉత్తర్వులు 2013ను అనుసరించి తదుపరి చర్యల నిమిత్తం ఈ విషయాన్ని సంబంధిత వర్గాల దృష్టికి తీసుకువస్తున్నట్టు ఎన్పీపీఏ పేర్కొంది.