హైదరాబాద్: కరోనా మూడోవేవ్ను ఎదుర్కొనేందుకు టీకాయే ఆయుధమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ పరిధిలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వెంకయ్య దంపతులు ప్రారంభించారు. వ్యాక్సినేషన్ను ప్రజా ఉద్యమంలా భావించి విజయవంతం చేయాలని కోరారు.