న్యూఢిల్లీ : రాష్ర్టపతి రామ్నాథ్ కోవింద్ తెలంగాణ రాష్ర్ట ప్రజలకు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఉజ్వల భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఇంటింటికి తాగునీరు ఇచ్చే జాతీయ లక్ష్యాన్ని తెలంగాణ సాధించిందని రాష్ర్టపతి ప్రశంసించారు.