ప్రజాస్వామ్యంలో, సుపరిపాలనకు పారదర్శకత అత్యంత ముఖ్యమైందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. దర్బార్ అనే పదాన్ని స్వాతంత్రం రాని రోజుల్లో రాచరికానికి గుర్తుగా వాడేవారని, కానీ.. ఈ ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో దర్బార్ అంటే పారదర్శకతకు సూచిక అని వివరించారు. ముంబై రాజ్భవన్లో పునర్నిర్మించిన దర్బార్ హాలును రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో రాష్ట్రపతి భవన్ ఎలాగైతే ప్రసిద్ధి పొందిందో, అలాగే ముంబైలోని రాజ్భవన్ కూడా రాజ్యాంగ ఆకాంక్షలకు అద్దంగా నిలబడిందని కితాబునిచ్చారు.
స్వాతంత్య్రానికి పూర్వం దర్బార్ అనే పదం రాచరికానికి చిహ్నంగా ఉండేది. కానీ.. ఈ ప్రజాస్వామ్య యుగంలో ఆ పదం ప్రజాస్వామ్యంతో ముడిపింది. ఆధునిక యుగంలో దర్బార్ పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. ప్రజాస్వామ్యంలో సుపరిపాలనకు పారదర్శకత ఎంతో ముఖ్యం అని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పేర్కొన్నారు. దర్బారులో రహస్యాలు, ప్రైవేట్ కార్యకలాపాలు ఉండవని, అన్నీ బహిరంగంగానే జరుగుతాయని, అందర్నీ కలుపుకుపోతూనే వుంటాయని తెలిపారు. అయితే నిత్యం ప్రజలతో సత్సంబంధాలు నెరపడానికి రాజకీయ నేతలు కూడా జనతా దర్బార్ నిర్వహిస్తూ వుంటారని, ఈ పద్ధతి రాజకీయాల్లో చాలా పాపులర్ అయ్యిందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ వివరించారు.