న్యూఢిల్లీ: అవయవాల కొరత వల్ల చాలా మంది రోగులు కాలేయం, కిడ్నీ, ఇతర అవయవాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారని, ఈ నేపథ్యంలో అవయవ దానం(Organ Donation) కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఆర్గాన్ డొనేషన్ గురించి విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టాలని ఆమె సూచించారు. ఢిల్లీలోని లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ 9వ కాన్వకేషన్లో ఆమె పాల్గొని మాట్లాడారు. మన దేహంలో లివర్ సెక్యూర్టీ గార్డులా పనిచేస్తుందని, మన దేశంలో కాలేయ సంబంధిత సమస్యలు ఎక్కువ అని, దానివల్ల వస్తున్న వ్యాధులు ఆందోళన కలిగిస్తున్నాయని ముర్ము తెలిపారు. లివర్ వ్యాధుల నియంత్రణలో లివర్ ఇన్స్టిట్యూట్ కీలక పాత్ర పోషిస్తుందని ఆమె అన్నారు. రకరకాల అవయవాల దానం అవసరమని, అందుకే వాటిపై అవగాహన పెంచాలని ఆమె పేర్కొన్నారు.
पर्याप्त संख्या में organs के उपलब्ध न होने के कारण बहुत से मरीज liver या kidney transplant अथवा किसी अन्य transplant से वंचित रह जाते हैं। हमारे देश में organ donation यानी देह-दान के बारे में लोगों को प्रोत्साहित करने के लिए बड़े से बड़े पैमाने पर अधिक से अधिक जागरूकता अभियानों…
— President of India (@rashtrapatibhvn) December 27, 2023