సీడీఎస్ బిపిన్ రావత్ మృతిపై రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాతో సహా పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అత్యంత ధైర్య సాహసాలు చూపించే బిడ్డను ఈ దేశం కోల్పోయిందని రాష్ట్రపతి కోవింద్ పేర్కొన్నారు.
”సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక అకాల మరణం తీవ్రంగా బాధించింది. అత్యంత ధైర్య సాహసాలు చూపించే బిడ్డను ఈ దేశం కోల్పోయింది. అత్యంత శౌర్య ప్రతాపాలతో, హీరోయిజంతో ఆయన మాతృభూమికి సేవలందించారు. ఈ లక్షణాలతో ఆయన గుర్తింపు పొందారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను” -రాంనాథ్ కోవింద్ (రాష్ట్రపతి)
”రావత్ ఓ నిబద్ధత ఉన్న సైనికుడు. నిజమైన దేశభక్తుడు. దేశ రక్షణ వ్యవస్థను, రక్షణకు కావల్సిన ఉపకరణాల ఆధునికీకరణలో అద్భుతమైన సేవలందించారు. ఆయన మరణించడం నన్నెంతగానో బాధించింది. వ్యూహాత్మక, రక్షణ విషయాలపై ఆయనకున్న దృష్టి అద్భుతమైంది. తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ దుర్ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది మరణించడం ఎంతో బాధించింది. వారందరూ మాతృభూమికి ఎంతో సేవలు చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి…” -నరేంద్ర మోదీ (ప్రధాని)
”హెలికాప్టర్ దుర్ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సిబ్బంది మృతి చెందారన్న వార్త ఎంతో షాక్కు గురి చేసింది. ఈ విషయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్తో మాట్లాడా. నా సానుభూతిని వ్యక్తం చేశాను. దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నా. ”– వెంకయ్య నాయుడు (ఉప రాష్ట్రపతి)
”అత్యంత ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తించిన వారిలో బిపిన్ రావత్ ఒకరు. మాతృభూమికి పరిపూర్ణ శ్రద్ధాసక్తులతో సేవలందించారు. ఆయన చేసిన సేవ, త్యాగం మాటల్లో చెప్పలేను. కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా” – అమిత్షా (కేంద్ర హోంమంత్రి)