న్యూఢిల్లీ, జనవరి 31: పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్రప్రభుత్వ విధానాల రూపకల్పన, అమలు జరుగుతున్నదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. కరోనా సంక్షోభంలోనూ వ్యవసాయ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదు కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత చిన్న, సన్నకారు రైతులదే అని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం ఆయన ఉభయ సభలను ఉద్దేశించి 50 నిమిషాలు ప్రసంగించారు. రైతుల కృషితో రికార్డు స్థాయి దిగుబడులు వచ్చాయన్నారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలను వివరించారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..