న్యూఢిల్లీ : లండన్లో జరిగే దివంగత బ్రిటిష్ రెండో రాణి ఎలిజబెత్ అంత్యక్రియలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆమె క్వీన్ ఎలిజబెత్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలపనున్నారు. సెప్టెంబర్ 8న కన్నుమూసిన క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము సెప్టెంబర్ 17-19న లండన్ సందర్శిస్తారు.
క్వీన్ ఎలిజబెత్ మరణం పట్ల అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్ధీప్ ధంకర్ సంతాపం వ్యక్తం చేశారు. రాణి మరణం పట్ల భారత్ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపేందుకు సెప్టెంబర్ 12న విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ను సందర్శించారు.
ఇక దివంగత బ్రిటిష్ రాణి క్వీన్ ఎలిజబెత్ శవపేటికను బకింగ్హాం ప్యాలెస్లో కింగ్ చార్లెస్, రాజ కుటుంబసభ్యులు మంగళవారం రిసీవ్ చేసుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలను సెప్టెంబర్ 19న భారీ స్ధాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాధినేతలు, రాజులు, రాణులు సహా 500 మంది వీఐపీలు అంత్యక్రియలకు తరలిరానున్నారు.