న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి సంబంధించిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్ను విడుదల చేశారు.
సీఈసీ, ఈసీల నియామకాల బిల్లుతో పాటు ప్రెస్, రిజిస్ట్రేషన్ ఆఫ్ పిరియాడికల్స్ బిల్లుకూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (రెండో సవరణ బిల్లు, 2023), తాత్కాలిక పన్నుల వసూలు బిల్లు, 2023కు ఆమె ఆమోదముద్ర వేశారు.