న్యూఢిల్లీ, ఆగస్టు 16: జపాన్కు చెందిన ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ యునిక్లో.. దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నది. 2019లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన సంస్థకు ఉత్తరాదిన ఏడు స్టోర్లు ఉన్నాయి. ముంబైలో తన రెండో అవుట్లెట్ను కంపెనీ ఇండియా సీఈవో టోమోషికో సేయ్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
వ్యూహాత్మక వ్యాపార విస్తరణలో భాగంగా ముంబైలో తన రెండో అవుట్లెట్ను ప్రారంభించినట్లు, త్వరలో దక్షిణాది మార్కెట్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. బెంగళూరు, హైదరాబాద్, కోల్కతా, చెన్నై వంటి మెట్రో నగరాలకు తమ అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు చెప్పారు.