భోపాల్: ముగ్గురు వ్యక్తులు గర్భిణీపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Pregnant Woman Gang Raped) మరో మహిళతో కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలైన ఆ గర్భిణీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నది. మధ్యప్రదేశ్లోని మొరెనా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 34 ఏళ్ల మహిళ గర్భవతి. ఆమె భర్త తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చాంద్ కా పురా గ్రామానికి చెందిన ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో గర్భిణీ మహిళ భర్తను అరెస్ట్ చేయడంతో జైలుకెళ్లిన అతడు బెయిల్పై విడుదలయ్యాడు.
కాగా, భర్తపై అత్యాచారం కేసు పెట్టిన మహిళతో రాజీ కోసం గర్భిణీ ప్రయత్నించింది. ఆ మహిళ గ్రామానికి వెళ్లింది. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ మహిళతోపాటు ఆ ముగ్గురు కలిసి గర్భిణీపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలైన ఆమెను గ్వాలియర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. మెజిస్ట్రేట్ సమక్షంలో ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.