న్యూఢిల్లీ, మే 14: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్ను కేంద్రం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఈయన కర్ణాటక డీజీపీగా ఉన్నారు. ప్రధాని మోదీ అధ్యక్షుడిగా ఉన్న హైపవర్ కమిటీ ఆయన నియామకానికి ఆదివారం ఆమోద ముద్ర వేసింది.
సూద్ రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని కేంద్ర ప్రజా ఫిర్యాదుల, శిక్షణా శాఖ(డీవోపీటీ) వెల్లడించింది. ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టభద్రుడైన సూద్ 1989లో మైసూర్ ఏసీపీగా కెరీర్ ప్రారంభించారు.