షిమ్లా: ఆఖరి నిమిషం వరకు సీఎం పదవి కోసం గట్టిగా పోరాడిన హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ ప్రతిభా వీరభద్రసింగ్కు నిరాశే ఎదురైంది. పీసీసీ మాజీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు వైపే కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గుచూపింది. ఆయనను సీఎంగా ప్రకటించడంతో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. పార్టీ అగ్రనేతలతోపాటు సీఎం పదవిని ఆశించి భంగపడిన ప్రతిభా సింగ్ కూడా ఈ ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు.
అయితే, సుఖ్విందర్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముందు మీడియా ప్రతినిధులు ప్రతిభాసింగ్ను ఆమె ఇంటిదగ్గర కలిశారు. మీ ప్రత్యర్థి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మీరు హాజరవుతారా అని మీడియా ప్రశ్నించగా.. ఆమె తనదైన రీతిలో జవాబిచ్చారు. అతని ప్రమాణస్వీకార కార్యక్రమానికి నేను ఎందుకు హాజరుకావద్దు అని ఎదురు ప్రశ్నించారు. తప్పకుండా హాజరవుతానని చెప్పారు. పీసీసీ చీఫ్గా అతని (సుఖ్విందర్) ప్రమాణస్వీకారానికి హాజరవడం తన ప్రధాన కర్తవ్యమన్నారు.