అమేథీ: ప్రతాప్గఢ్-కాన్పూర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో డ్యూటీలో ఉన్న డ్రైవర్ శుక్రవారం రైలు నడుపుతుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతిచెందినట్లు రైల్వే అధికారి తెలిపారు. పరశురాంపూర్ చిల్బిలాకు చెందిన రైలు డ్రైవర్ హరిశ్చంద్ర శర్మ (46) కాన్పూర్ వైపు రైలును నడుపుతుండగా కాసింపూర్ హాల్ట్ సమీపంలో అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య ఏర్పడిందని గౌరీగంజ్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ప్రవీణ్సింగ్ తెలిపారు.
రైలులో ఉన్న అసిస్టెంట్ పైలట్ రైలును ఆపి అంబులెన్స్కు ఫోన్ చేశాడు. శర్మను సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారని సింగ్ తెలిపారు.
శర్మకు గుండెపోటు వచ్చినట్లు వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. ప్రతాప్గఢ్ నుంచి మరో లోకో పైలట్ రావడంతో రైలు అక్కడి నుంచి వెళ్లిపోయిందని సింగ్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఫుర్సత్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి మనోజ్కుమార్ సోన్కర్ తెలిపారు.