పట్నా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ బీహార్లోని బాంకీపూర్ ఉప ఎన్నిక నామినేషన్లో తనకు రూ.96 కోట్ల ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. తనకు రూ.5.77 కోట్ల బ్యాంక్ రుణం కూడా ఉన్నట్టు తెలిపారు. భారీ సంఖ్యలో మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో వెంట రాగా పట్నాలో సోమవారం ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.
నామినేషన్లో పేర్కొన్న దాని ప్రకారం ఆయన భార్య జాహ్నవి దాస్కు రూ.102 కోట్ల ఆస్తులున్నాయి. ‘ఇది కేవలం నా నామినేషన్ కాదు, బీహార్లో రాజకీయ మార్పు కోసం పిలుపు. నేర చరిత్ర ఉన్నవారు తమ పదవులను వదులుకోవాల్సిందే’ అని ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ అన్నారు.