న్యూఢిల్లీ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో పార్టీ అగ్రనేతలను కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలపై సమగ్ర నివేదికను సమర్పించారు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్లో చేరవచ్చని, ఆయనను కేవలం కన్సల్టెంట్ పాత్రకు పరిమితం చేయకుండా పార్టీలో చేరి నాయకుడిగా పనిచేయాలని కాంగ్రెస్ కోరుతోందని సీనియర్ నేత వెల్లడించారు.
2024 లోక్సభ ఎన్నికల కోసం పార్టీ ప్రక్షాళనతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిషోర్ రోడ్మ్యాప్ను తాజా భేటీలో అందించారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ఇప్పటికే బలంగా ఉన్న రాష్ట్రాలపై మరింతగా దృష్టిసారించాలని ప్రశాంత్ కిషోర్ సూచించారని పేర్కొన్నాయి.
కాంగ్రెస్ పార్టీ 370 లోక్సభ స్ధానాలపై పోకస్ పెట్టాలని మిగిలిన స్ధానాల్లో భాగస్వామ్య పక్షాలతో కూటమిగా బరిలో దిగాలని సూచించారని వెల్లడించాయి. ఇక గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ నేతలతో చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి.