న్యూఢిల్లీ, నవంబర్ 7: అదానీ కేసుకు సంబంధించి తాము వేసిన పిటిషన్లు కనీసం లిస్టింగ్ కాకపోవడంపై పిటిషనర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి సంబంధించిన హిండెన్బర్గ్ ఉదంతంపై సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆగస్టు 28న విచారణ జరగాల్సి ఉండగా, రెండు నెలలైనా కనీసం కేసులు లిస్టింగ్ కాలేదు. దీంతో ఒక పిటిషనర్ తరఫున సుప్రీం కోర్టులో హాజరైన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
కేసు లిస్టింగ్ కాకుండా పదేపదే వాయిదా పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు.దీనిపై స్పందించిన సీజేఐ చంద్రచూడ్ దీనిపై రిజిస్ట్రీని అడుగుతానని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు క్లుప్తంగా పరిశీలిస్తే ఆదానీ సంస్థలు పలు ఆర్థిక అవకవకలకు పాల్పడినట్టు అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఒక నివేదిక విడుదల చేసింది. దానిని అదానీ గ్రూపు తిరస్కరించింది.