లక్నో, మార్చి 5: ఇక నుంచి వారణాశిలోని కాశీ విశ్వేశ్వరుని ఆలయంలో ప్రసాదాన్ని తృణ ధాన్యాలతో తయారు చేయనున్నారు. ఇక్కడ అందజేస్తున్న ‘లడ్డూ ప్రసాదం’ను ఇకపై ‘శ్రీ అన్న ప్రసాదం’గా పిలువనున్నట్టు ఆలయ అధికారి ఒకరు ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు ప్రసాదం తయారు చేస్తున్న నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వారే శ్రీ అన్న ప్రసాదాన్ని కూడా అందజేయనున్నారు.
బరువులో కానీ, ధరలో కానీ తేడా ఉండదని, అలాగే పూర్తి శుభ్రత, నాణ్యతతో తృణ ధాన్యాలు, జీడిపప్పు, స్వచ్భమైన నెయ్యి, బెల్లం తదితరాలతో ఈ ప్రసాదాన్ని తయారు చేయనున్నట్టు ఆలయ చీఫ్ డెవలప్మెంట్ అధికారి హిమాన్షు తెలిపారు.