ముంబై : రానున్న లోక్సభ ఎన్నికలకు మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీలు త్వరగా సీట్ల సర్దుబాటును పూర్తి చేయాలని ఎంవీఏ (మహా వికాస్ అఘడి) నేతలను బహుజన్ వికాస్ అఘడి మాజీ చీఫ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాష్ అంబేడ్కర్ (Prakash Ambedkar) కోరారు. సీట్ల పంపిణీలో జాప్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీల మధ్య విభేదాలతో సీట్ల సర్దుబాటులో జాప్యం తలెత్తడంపై ప్రకాష్ అంబేడ్కర్ విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య దాదాపు పది సీట్లపై, కాంగ్రెస్, సేన, ఎన్సీపీ (ఎస్పీ)ల మధ్య దాదాపు 5 సీట్లపై ఏకాభిప్రాయం కుదరలేదని తాను అర్ధం చేసుకున్నానని, అందుకే ఎంవీఏలో సీట్ల సర్దుబాటు ఖరారు కావడంలో జాప్యం జరుగుతున్నదని ప్రకాష్ అంబేడ్కర్ ఎంవీఏ నేతలకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. తాను ఏఐసీసీ మహారాష్ట్ర ఇన్చార్జ్ రమేష్ చెన్నితలతో మాట్లాడానని, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేనతో చర్చలు కొలిక్కిరాకపోవడంతో పీటముడి కొనసాగుతున్నదని అన్నారు.
బీజేపీ-ఆరెస్సెస్లను కూలదోసేందుకు సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకునేందుకు వీలైనంత త్వరగా తనను కలవాలని వీబీఏ నేత ప్రకాష్ అంబేడ్కర్ కాంగ్రెస్ను కోరారు. మరోవైపు ప్రకాష్ అంబేడ్కర్తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ఆయన త్వరలో ఇండియా కూటమిలో చేరతారని మహారాష్ట్ర విపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివర్ తెలిపారు. రాహుల్ గాంధీ చేపడుతున్న యాత్రలో పాల్గొనాలని ఇండియా కూటమి తరపున ప్రకాష్ అంబేడ్కర్ను ఆహ్వానిస్తామని చెప్పారు.
Read More :
Muhammad Ali | హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్లో ‘బాక్సింగ్ గ్రేట్’.. మరణం తర్వాత దక్కిన గౌరవం