Prajwal Revanna |బెంగళూరు : కర్ణాటకలోని హాసనలో జేడీఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయస్ ఎం పాటిల్పై 2369 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఇటీవల మహిళలపై లైంగిక దౌర్జన్యం, కిడ్నాప్ వంటి ఆరోపణలతో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టు అయిన సంగతి తెలిసిందే.
అత్యాచార ఆరోపణలతో అరెస్టు అయిన హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజ్వల్ను సిట్ అధికారులు అంబులెన్స్లో సోమవారం శివాజినగర్లోని బౌరింగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కోర్టుకు సమర్పించేందుకు అవసరమైన మూడు, నాలుగు రకాల వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులను కోరారు. దీంతో మెడికల్ కాలేజీ డీన్, సూపరింటెండెంట్ సమక్షంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజ్వల్ను కస్టడీకి తీసుకుని మూడు రోజులు గడిచింది. ఏ ప్రశ్న అడిగినా తాను తప్పు చేయలేదని, ఇదంతా రాజకీయ కుట్ర అని, తనను రాజకీయంగా వేధిస్తున్నారని చెప్పినట్లు తెలుస్తోంది.