న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత్లో జనాభా రోజురోజుకు పెరుగుతున్నది. అయితే జనాభా పెరిగిన నిష్పత్తిలో దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడం లేదు. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించి ఓటుహక్కు కల్పించక పోయినా, ఉన్న హక్కును నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినా ఏమీ చేయలేక ఒక బాధిత సమూహం నిస్సహాయ స్థితిలో ఉంది.
దేశ వ్యాప్తంగా ‘సర్’ సర్వే నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మురికివాడలు, అనధికార నివాస ప్రాంతాల్లో నివసించే వారిలో చాలామంది ఓటు హక్కు కోల్పోయిన వారిలో ఉన్నారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సర్లో కూడా పట్టణ ప్రాంత ఓటర్లు లక్ష్యంగా లక్షలాది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. వీరిలో పేదలు, దళితులు, అణగారిన వర్గాలు, అసంఘటిత, వసల కార్మికులు ఎక్కువగా ఉన్నారు.