తిరువనంతపురం : ప్రముఖ చెఫ్, మళయాళ సినీ నిర్మాత ఎంవీ నౌషద్ (55) శుక్రవారం ఉదయం పథనమిట్టలోని ఓ ప్రైవేట్ దవాఖానలో మరణించారు. ఇన్ఫెక్షన్ బారినపడి చికిత్స పొందుతున్న నౌషద్కు గత 18 నెలలుగా పలు సర్జరీలు జరిగాయి. చెఫ్గా పేరుప్రఖ్యాతులు గడించిన నౌషద్కు కేరళలో ప్రముఖ కేటరింగ్, రెస్టారెంట్ చైన్ వ్యాపారాలున్నాయి.
ఇక 2004లో మమ్ముట్టితో ఆయన నిర్మించిన కజ్చ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. నిర్మాతగా ఆయన తెరకెక్కించిన పలు సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. ఆయన పలు టీవీ ఛానెళ్లలో ప్రసారమైన కుకింగ్ షోస్లోనూ వీక్షకులను తనదైన వంటలతో అలరించారు. ఈ నెలలోనే నౌషద్ భార్య షీబా (51) గుండెపోటుతో మరణించడం ఆయనను కుంగదీసింది. ఆయనకు కుమార్తె నష్వా (13) ఉన్నారు.