Arunachal Pradesh | ఇటానగర్, మార్చి 27: ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే వార్త ఇది. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక బూత్లో ఓటేసేది కేవలం ఒకే ఒక్క ఓటర్. ఆమె ఒక్క ఓటు కోసం ఎన్నికల సిబ్బంది సాహసం చేయాల్సి ఉన్నది. ఆ బూత్కు చేరుకోవాలంటే సుమారు 40 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లాలి.
ఆ గ్రామం పేరు మలోగం. అక్కడ ఉన్న ఓటర్ 44 ఏండ్ల సోకెలా తయాంగ్. ప్రతి ఓటరు తన వాణిని వినిపించాలన్న తమ నిబద్ధతకు ఈ పోలింగ్ బూత్ ఏర్పాటే నిదర్శనమని ఎన్నికల అధికారి పేర్కొన్నారు.