Chhattisgarh | రాయ్పూర్, అక్టోబర్ 13: ఛత్తీస్గఢ్లోని బస్తర్ రీజియన్ అంటేనే మావోయిస్టుల అడ్డా అని పేరున్నది. ఈ ప్రాంత ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయాలంటే నానా తిప్పలు పడేవాళ్లు. కనీసం 10 కిలోమీటర్లు నడిచి వెళ్లి ఓటేసే పరిస్థితి ఉండేది.
కానీ స్వతంత్ర భారతదేశంలో తొలిసారిగా బస్తర్ రీజియన్లోని 120కిపైగా గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ 120కిపైగా గ్రామాలు దాదాపు అడవిని ఆనుకొని ఉంటాయి. త్వరలో జరుగనున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా గ్రామాల ప్రజలు తమ ఊరిలోనే ఓటు వేయవచ్చు.