న్యూఢిల్లీ : భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ ఇవాళ జరగనుంది. పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎన్డీఏ కూటమి తరపున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్ఖడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. టీఎంసీ మినహా 744 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొననున్నారు. ఇక సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. రాత్రికల్లా ఫలితం వెలువడనుంది. ఈ నెల 11వ తేదీన కొత్త ఉప రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగియనుంది.
Polling for the #VicePresidentialElections2022 to be held today.
Jagdeep Dhankhar is the vice-presidential candidate of the ruling NDA, while the opposition, led by the Congress has chosen Margaret Alva as its candidate for the post
(file pics) pic.twitter.com/jahZFuPNtK
— ANI (@ANI) August 6, 2022