పంజాబ్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి ప్రతాప్ సింగ్ జలంధర్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక… కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత మనీశ్ తివారీ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంజాబ్ అవసరాలను దృష్టిలో పెట్టుకొనే ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఆప్.. ముఖ్యమంత్రి అభ్యర్థి.. భగవంత్ మాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశం కోసం చాలా మంది తమ ప్రాణాలను అర్పించారని, తమకు నచ్చిన వ్యక్తికి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ ఝకర్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పంజాబ్ను విభజించి పాలించాలని చూస్తున్న వారికి ప్రజలు తమ ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెబుతారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ముఖ్యమంత్రి చెన్నీ మాట్లాడుతూ.. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంచి ప్రభుత్వం, పారదర్శకతతో ఉన్న ప్రభుత్వం.. తాను ఎప్పుడూ మంచినే కోరుకుంటానని, అందుకే దేవాలయంలో పంజాబ్ బాగుండాలని కోరుకున్నట్లు సీఎం చెన్నీ వెల్లడించారు.