బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పీకే భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి భోజనం కూడా చేశారు. 2020 లో ప్రశాంత్ కిశోర్ జేడీయూకు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత.. వీరిద్దరూ కలుసుకోవడం ఇదే ప్రథమం.
ఈ భేటీపై సీఎం నితీశ్ స్పందిస్తూ… ‘తమ ఇద్దరి మధ్యా పాత స్నేహం ఉందని, అందుకే కలుసుకున్నాం అని బదులిచ్చారు. ఇది కేవలం భోజనం సమావేశం మాత్రమేనని, అంతకు మించి ఏమీ ఊహించుకోవద్దని నితీశ్ కుమార్ అన్నారు.
ఇక… పీకే కూడా ఈ భేటీపై స్పందించారు. ‘ఇది కేవలం మర్యాద పూర్వక భేటీయే. మామూలు అంశాలపైనే మాట్లాడుకున్నాం. ఒమిక్రాన్తో సీఎం నితీశ్ బాధపడుతున్న సమయంలో కూడా ఫోన్లో మాట్లాడాను’ అని పీకే వివరించారు. అయితే పీకేతో భేటీ కావాలని సీఎం నితీశే భావించారని… సీఎం నితీశే పీకేను ఆహ్వానించారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.