న్యూఢిల్లీ: కేదార్నాథ్ దేవాలయం ఆవరణలో ఫొటోలు, వీడియోలు దిగటం నిషిద్ధం. అలాంటిది గర్భగుడిలోకి అడుగుపెట్టిన ఓ మహిళ శివలింగంపై నోట్లు చల్లుతూ వీడియో దిగటం, ఆలయ పూజారి సమక్షంలో ఇదంతా చేస్తూ.. వీడియో చిత్రీకరించటంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ ఘటనపై సోషల్మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలంటూ దేవాలయ కమిటీ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.