ఫుణే: మహారాష్ట్రలోని ఫుణె జిల్లా, న్యూఢిల్లీలో రూ.2,000 కోట్ల విలువైన 1,100 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్ను పోలీసులు సీజ్చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఫుణే సిటీ కమిషనర్ అమితేశ్కుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.
తొలుత ఆదివారం ముగ్గురు నిందితులను అరెస్టుచేసి పుణే జిల్లాలో 400 కేజీల మెఫెడ్రోన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. విచారణలో నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఢిల్లీలోని గోదాములపై సైతం దాడులు నిర్వహించి మొత్తం 1,100 కిలోల మెఫడ్రోన్ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.